DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రెస్ నోట్*** టి డి పి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కి రాయలచెరువు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరిన బీజేపీ జిల్లా నాయకులు, అసోసియేషన్ అధ్యక్షులు బొండా యల్లాజీరావు ******************కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 86 వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న టి డి పి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దువ్వాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింద 4 కోట్ల ఖర్చుతో అదునాతన కంటైనర్ షాపింగ్ క్యాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలు వలన రాష్ట్రము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండి వలె డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. దీనిలో భాగంగానే ఎన్నికలు ముందు మనం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూనే ఇటువంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు బొండా యల్లాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అటు రాష్ట్ర అధ్యక్షులుగా కూటమి నాయకులను సమన్వయము చేసుకుంటూ ఇటు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని అభినందనలు తెలిపారు. గతంలో మీ హయాంలోనే రాయలచెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారని, ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తం "ఈనగాచి నక్కల పాలు" అన్న చందంగా పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది. దయచేసి వీలున్నంత త్వరగా జిమ్ మెయింటేనేన్స్, గ్రీనరీకి నీరు పెట్టడం, చెరువు పూడికతీత, లైట్లు పునరుద్దరణ, ముఖ్యంగా యుద్ధ ప్రాతిఫదికన యోగ కేంద్రం నిర్మాణం చేపట్టాలని కోరడమైనది. దీనిపై ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టి డి పి గాజువాక సమన్వయ కర్త ప్రసాదుల శ్రీను, వార్డు నాయకులు నల్లూరు సూర్యనారాయణ, వేగుంట శ్రీను,చదరం తులసిరామ్, లోవబాబు, తలారి వెంకటరమణ, బొడ్డపల్లి అప్పారావు,బీజేపీ నాయకులు మోటూరు బాబురావు, అశోక్, జనసేన నాయకులు గంధం వెంకటరావు, కాదా శ్రీను, జి వి ఎం సి అధికారులు, పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు
Admin
DNB News