DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రదాయంగా నిలిచిన ఆర్.డి.టి (RDT) సంస్థ యొక్క FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడంపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ లైసెన్స్ పునరుద్ధరణకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆర్.డి.టి సంస్థ రాష్ట్రంలో అనాధలకు ఆశ్రయాలు, వికలాంగులకు అవసరమైన పరికరాలు, పేద-ధనిక తేడా లేకుండా వైద్య సేవలు, విద్యా సంస్థలు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, పండ్ల తోటల అభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం మరియు క్రీడా మైదానాల నిర్మాణం, పేద విద్యార్థులకు విద్యా సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్.డి.టి సంస్థకు FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడం ఎంతో శుభపరిణామమని, దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు.
Admin
DNB News