DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలు సంతృప్తి చెందే విధంగా పనులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆశోక్ నగర్, పాతబస్తీ, కల్లూరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న మరియు మధ్యస్థాయి కాలువల్లో ప్రతి వారం క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా గ్యాంగ్ వర్కర్లతో పూడికతీత పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పూడికతీత అనంతరం బయటకు తీసిన చెత్తను 24 గంటలలోపు పూర్తిగా తొలగించాలన్నారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు రాజు, మునిస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News