DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో నేర నియంత్రణతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు కర్నూలు పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు మరియు చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని వారికి సూచించారు. సమాజంలో మంచి పౌరులుగా జీవించేందుకు మార్గనిర్దేశం చేశారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. – జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు
Admin
DNB News