Sunday, 02 August 2026 10:18:41 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

Date : 26 April 2026 11:54 AM Views : 77

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి (JCJ)గా ఎంపికైన మహమ్మద్ అజామ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన అజామ్‌ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, న్యాయవ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి పోలీస్ శాఖలో సేవలందిస్తుండగా, కుమారుడు న్యాయవ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని కొనియాడారు. ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహమ్మద్ అజామ్ నేపథ్యం: కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్, కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అల్లాబకాష్, షేకూన్ దంపతుల కుమారుడు. విద్యార్హతలు: ప్రాథమిక విద్యను కర్నూలులోనే పూర్తి చేసిన అజామ్, హైదరాబాద్‌లోని పెండేకంటి లా కాలేజీలో ఎల్.ఎల్.బి (LLB), విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎమ్ (LLM) పూర్తి చేశారు. 2025 నోటిఫికేషన్‌లో హైకోర్టు నిర్వహించిన రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మహమ్మద్ అజామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: