Wednesday, 17 June 2026 05:16:38 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎమ్మిగనూరులో కార్పొరేట్ విద్యా మాఫియా ఆగడాలు... *నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు :AISF ఫైర్..

Date : 15 May 2026 11:59 AM Views : 34

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ముందస్తు అడ్మిషన్లు, అక్రమ ప్రచారాలతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గపూర్ అధ్యక్షతన పట్టణ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యస్ షాబీర్ భాష మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో నెంబర్-1కు వ్యతిరేకంగా పట్టణంలోని అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను ఆకర్షిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఉల్లంఘిస్తూ ర్యాంకుల పేరుతో మోసపూరిత ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని యస్ షాబీర్ భాష ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకుని, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయా విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హాజీ, శివ, వీరేష్, చరణ్, గౌతమ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: