DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్కు చెందిన సుమారు 250 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న ప్రజాహిత పాలనతో పాటు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు చూసి ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన భూపతి మరియు అరుణ్ జ్యోతి నగర్ వాసులు మాట్లాడుతూ, తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం టీడీపీనే సరైన వేదికగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News