DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్లో స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న సందర్భంగా ఆమదాలవలస పట్టణం లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జి చింతాడ రవికుమార్ గారు ,మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు,జెడ్పీటీసీలు,రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు, ప్రెసిడెంట్ లు,ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,జగన్ అన్న అభిమానులు పాల్గొన్నారు
Admin
DNB News