DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసు అధికారులు సచివాలయ మహిళా పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శించి మహిళల భద్రత, రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.పాఠశాలల విద్యార్థినులకు సైబర్ నేరాలు, శక్తి యాప్ వినియోగం, సోషల్ మీడియా భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 100, 112, 1930 హెల్ప్లైన్ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
Admin
DNB News