DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. Cr.No.10/2026 U/s 103 (1), 118 (1), 351 (2) r/w 3 (5) BNS & Sec 3 (2) (v) of SC/ST (POA) Act ప్రకారం కేసు నమోదు చేయబడింది. పిర్యాది: అమరచింతల మారుతి (29 సం.), తండ్రి కర్రెన్న, ఖండేరి వీధి, కర్నూలు. మృతుడు: అమరచింతల మనోహర్ (40 సం.), తండ్రి కర్రెన్న, ఖండేరి వీధి, కర్నూలు. ముద్దాయిలు: తెలుగు నగేష్ (24 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు తెలుగు రాజు (36 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు ఎరుకలి రాముడు @ మూగేన్న (46 సం.), ఖండేరి వీధి, కర్నూలు తెలుగు ఈరన్న (47 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు సంఘటన వివరాలు: 22.02.2026 రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో పాత బస్ స్టాండ్ సమీపంలోని అనిల్ బార్ వద్ద పిర్యాది మారుతి బాబాయి విజయ్ మరియు ముద్దాయిలు మద్యం సేవిస్తూ ఉండగా, మద్యం తీసుకురావాలని చెప్పిన విషయంలో వివాదం ఏర్పడింది. ఆ గొడవ మరింత తీవ్రమై, ముద్దాయిలు నలుగురు ఖండేరి ప్రాంతంలోని ఐటీఐ కాలేజీ సమీపానికి ఆటోలో వెళ్లి పిర్యాది మరియు అతని బాబాయి విజయ్పై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడు అమరచింతల మనోహర్ అక్కడికి చేరుకోగా, ముద్దాయిలు అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి, ఎడమ వైపు మెడపై కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో కిందపడిన మనోహర్ను బంధువులు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పిర్యాది మారుతికి కూడా గాయాలు అయ్యాయి. అరెస్ట్ వివరాలు: కేసు దర్యాప్తులో భాగంగా 25.02.2026 సాయంత్రం 6:40 గంటలకు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో, వన్ టౌన్ సీఐ పార్థసారథి, ఎస్సై చంద్ర, ఎస్సై ఖాన్ మరియు పోలీసు సిబ్బంది జోహారాపురం కరెంట్ సబ్స్టేషన్ సమీపంలో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ముద్దాయిల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఒక ఆటో రక్తపు మరకలతో ఉన్న రెండు కత్తులు ఒక పంచ్ (నకులు) సీజ్ చేయబడినవి. అరెస్ట్ అనంతరం ముద్దాయిలను న్యాయస్థానం ముందు హాజరు పరచడమైనది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Admin
DNB News