DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని శుక్రవారం పేట ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను నాగరాజు అనే వ్యక్తి ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ పట్టాలు పొందినప్పటికీ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ను కలిసి తమ సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News