Friday, 17 April 2026 03:47:47 PM
# ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం

ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్..

Date : 16 April 2026 06:29 PM Views : 81

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణానికి చెందిన బి. జాఫర్ తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ను ఆశ్రయించి పోలీసు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. తాను ఆదోని షాహీ జామియా మసీదు ఆస్తులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వినియోగంపై గత ఒక నెలగా నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సరైన పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్నికలు జరగకపోవడానికి కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన జాఫర్, ఈ విషయంపై ఇటీవల సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు రెండు సార్లు మీడియా సమావేశాల ద్వారా సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవలి మూడు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :