DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రిటైర్డ్ సైన్సు ఉపాధ్యాయులు ఎన్ రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని సివి రామన్ చిత్రపటానికి పూలమాల అలంకరించి ,రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా సైన్స్ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున మాట్లాడుతూ సైన్స్ నో నిజ జీవితంలో అనువర్తించుకోవాలని మీలో అనేకమంది భావి భారత పౌరులుగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని అభిలాషించారు. అలాగే సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులు డాక్టర్ సుధాకర్, ప్రసాద్ ,సురేష్,శ్యామలాదేవి, రేణుకాదేవి , రాధా, సువేదమ్మ, సుజానమ్మ మల్లమ్మ , ఇమ్రాన్ తదితరులు ముఖ్యఅతిథి రామయ్య ని పూలమాల, శాలువతో సన్మానించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన సైన్స్ ఫేర్ ను ప్రారంభించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Admin
DNB News