DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న భాష్యం, చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని PDSO, DSF విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ… ఈ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, సమ్మర్ హాలిడేస్ ప్రకటించినప్పటికీ భాష్యం, చైతన్య, నారాయణ సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై సెలవు రోజుల్లో కూడా అడ్మిషన్లు చేయాలని ఒత్తిడి తేవడం సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విద్యాసంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అక్రమాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో PDSO, DSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు జైకృష్ణ, మహేష్, కిరణ్, PDSO నాయకులు హరి, మోహన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News