DNB News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వినియోగంపై మద్దికేరలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్ఐ మద్దికేర మరియు పోలీసు సిబ్బంది కలిసి పత్తికొండ – గుంతకల్ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రమాద సమయంలో ప్రాణనష్టం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్కి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Admin
DNB News