DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ, అల్లాహ్ను ఆరాధించిన ముస్లిం సోదర సోదరీమణులందరికీ కలెక్టర్ డా. ఏ. సిరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత, సేవా భావం వంటి విలువలను పెంపొందించే పవిత్ర రంజాన్ మాసం ప్రత్యేకతను కొనియాడారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు, చెడును త్యజించడం వంటి సత్కార్యాల ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందించే ఈ పర్వదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అల్లాహ్ కృపతో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Admin
DNB News