DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కర్నూలు జిల్లా వాల్మీకి యువసేన ప్రధాన కార్యదర్శులు దొడ్డి రంగస్వామి, హనుమేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాల్మీకి సమాజానికి సంబంధించిన పలు సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. రాజకీయ స్వార్థాల కోసం వాల్మీకి యువతను ఉపయోగించుకొని వివిధ కేసుల్లో ఇరికించడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు మంత్రికి తెలియజేశారు. గత ప్రభుత్వ కాలంలో వాల్మీకులపై అన్యాయంగా, అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వాల్మీకులకు కులవృత్తిపరంగా స్థిరమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీవనోపాధి సమస్యలు పెరిగాయని వివరించారు. వాల్మీకి సమాజానికి ఆర్థికంగా మరియు రాజకీయంగా ప్రోత్సాహం కల్పించే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజ అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కుల సంఘానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News