DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న సూర్య ట్రేడర్స్ యూరియా ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి దుకాణంలోని యూరియా ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, రైతులకు సరఫరా చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ వివరాలు, విక్రయాల నమోదు పుస్తకాలు, రైతులకు సరైన విధంగా ఎరువులు అందుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు జరపాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దుకాణ యాజమాన్యానికి సూచించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, రికార్డులలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Admin
DNB News