DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదారు పాస్పుస్తకాల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు అందించబోయే పట్టాదారు పాస్పుస్తకాల వివరాలను స్వయంగా పరిశీలించి, ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతతో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వే ప్రక్రియలో రైతుల భూమి వివరాలు సరిగా నమోదు కావాలని, చిన్న తప్పిదాలు కూడా భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తాయని సూచించారు. రైతుల అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News