DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్లో గల తోటలో గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీతలు డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య, తెలుగు భాష వికాస ఉద్యమ నేత జెఎస్ఆర్కే శర్మ, పారిశ్రామికవేత్త సోమల గూడూరు రుక్మంగాధర్ రెడ్డి పాల్గొని, దుశాలో కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆత్మీయ అతిథులు యం. ఆంధ్రయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ సింగ్, మాజీ డీఎస్పీ పీరా సాహెబ్ పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలు గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవ, వైద్య సేవలు, సాంస్కృతిక మరియు రంగస్థల రంగాలలో చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వీరి సేవలను గుర్తించి అమెరికా టెక్సాస్లోని డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు డాక్టర్ బాబు మోహన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షుడు రత్న కుమార్, డాక్టర్ వరప్రసాద్, సినీ నటుడు ఘర్షణ శ్రీనివాస్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమారి, రచయిత డి. పార్వతయ్య, సయ్యద్ రోషనలి, పాణ్యం గోవిందరాజులు తదితరులు రంగస్థల పద్యాలు, పాటలతో సభను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమ సేవలను గుర్తించి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ని కూడా జి. పుల్లయ్య గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పి. దస్తగిరి, పి. హనుమంతరావు చౌదరి, ఎం. మనోహర్ బాబు, డిఎన్వి సుబ్బయ్య, డి. పుల్లయ్యతో పాటు కళాప్రియ తిరుపాలు, ఎం. చంద్రశేఖర్, చంద్రకాంతరెడ్డి, షేక్షావల్లి, ఋషికుమార్, సిద్దిక్ భాష, సుభాన్ భాష, వెంకటేశ్వర్లు, రాజన్న, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం, కర్నూలు జిల్లా.
Admin
DNB News