Friday, 17 April 2026 05:09:16 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

సమాజ సేవలో నిరంతరం కొనసాగాలి – గౌరవ డాక్టరేట్ గ్రహీతలకు ఘన సన్మానం..

Date : 08 April 2026 05:05 PM Views : 55

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్‌లో గల తోటలో గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీతలు డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య, తెలుగు భాష వికాస ఉద్యమ నేత జెఎస్ఆర్కే శర్మ, పారిశ్రామికవేత్త సోమల గూడూరు రుక్మంగాధర్ రెడ్డి పాల్గొని, దుశాలో కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆత్మీయ అతిథులు యం. ఆంధ్రయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ సింగ్, మాజీ డీఎస్పీ పీరా సాహెబ్ పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలు గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవ, వైద్య సేవలు, సాంస్కృతిక మరియు రంగస్థల రంగాలలో చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వీరి సేవలను గుర్తించి అమెరికా టెక్సాస్‌లోని డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు డాక్టర్ బాబు మోహన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షుడు రత్న కుమార్, డాక్టర్ వరప్రసాద్, సినీ నటుడు ఘర్షణ శ్రీనివాస్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమారి, రచయిత డి. పార్వతయ్య, సయ్యద్ రోషనలి, పాణ్యం గోవిందరాజులు తదితరులు రంగస్థల పద్యాలు, పాటలతో సభను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమ సేవలను గుర్తించి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ని కూడా జి. పుల్లయ్య గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పి. దస్తగిరి, పి. హనుమంతరావు చౌదరి, ఎం. మనోహర్ బాబు, డిఎన్వి సుబ్బయ్య, డి. పుల్లయ్యతో పాటు కళాప్రియ తిరుపాలు, ఎం. చంద్రశేఖర్, చంద్రకాంతరెడ్డి, షేక్షావల్లి, ఋషికుమార్, సిద్దిక్ భాష, సుభాన్ భాష, వెంకటేశ్వర్లు, రాజన్న, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం, కర్నూలు జిల్లా.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :