DNB News - ఆంధ్రప్రదేశ్ / : అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ అనుబంధ కమిటీల సమీక్షా సమావేశంలో ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అనుబంధ కమిటీల వ్యవస్థీకరణ, యువత మరియు మహిళల భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పార్టీ అనుబంధంగా ఉన్న వివిధ కమిటీల నిర్మాణం, బాధ్యతలు, కార్యకలాపాలపై వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ అనుబంధ కమిటీలను మరింత చురుకుగా పనిచేసేలా చేయాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయం పెంపొందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు వంటి విభాగాలకు ప్రత్యేక కమిటీలను బలోపేతం చేసి, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అనుబంధ కమిటీలు ,శిక్షణా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. పార్టీకి బలమైన వ్యవస్థే విజయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి 7 నియోజకవర్గాలకు సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Admin
DNB News