Saturday, 19 September 2026 05:18:10 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు మే 10 వరకు కొనసాగింపు – కాంగ్రెస్ నేత అనంతరత్నం మాదిగ డిమాండ్...

Date : 23 April 2026 04:39 PM Views : 106

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నుంచి కొత్తకోటకు నడిచే విద్యార్థి ప్రత్యేక బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్ అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అనంతరత్నం మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, మాజీ ఉపాధ్యక్షుడు రియాజ్ భాషా, కర్నూల్ 48వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ షబ్బీర్, 3వ వార్డు ఇన్‌చార్జ్ జావిద్ భాషతో పాటు డిగ్రీ విద్యార్థులు కలిసి కర్నూల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు ఎండాకాల సెలవులు ప్రకటించడంతో విద్యార్థి బస్సు సర్వీసును నిలిపివేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడం వల్ల డిగ్రీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాలలకు ఇంకా సెలవులు ప్రకటించని నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సేవలను కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, విద్యార్థుల సమస్యను పరిగణలోకి తీసుకుని కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :