DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నుంచి కొత్తకోటకు నడిచే విద్యార్థి ప్రత్యేక బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అనంతరత్నం మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, మాజీ ఉపాధ్యక్షుడు రియాజ్ భాషా, కర్నూల్ 48వ వార్డు ఇన్చార్జ్ షేక్ షబ్బీర్, 3వ వార్డు ఇన్చార్జ్ జావిద్ భాషతో పాటు డిగ్రీ విద్యార్థులు కలిసి కర్నూల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు ఎండాకాల సెలవులు ప్రకటించడంతో విద్యార్థి బస్సు సర్వీసును నిలిపివేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడం వల్ల డిగ్రీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాలలకు ఇంకా సెలవులు ప్రకటించని నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సేవలను కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, విద్యార్థుల సమస్యను పరిగణలోకి తీసుకుని కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు
Admin
DNB News