DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నుంచి ఆలూరు రోడ్డు నూతన బైపాస్ సమీపంలోని మేక వంకను కుదించి చట్ట విరుద్ధంగా నిర్మించిన సిమెంట్ కాలువను వెంటనే తొలగించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ అధికారులను డిమాండ్ చేశారు. తనకు అందిన సమాచారంతో నూర్ అహ్మద్ సదరు వంక ఆక్రమణ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంకలను కుదిస్తూ ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) ను ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే, బ్యాక్ వాటర్ ప్రభావంతో ఆదోని పట్టణం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో వంకలు ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మేక వంకకు సమగ్ర సర్వే నిర్వహించి, అన్ని ఆక్రమణలను తొలగించి, వంకను ఎఫ్టిఎల్ ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించాలని కోరారు. లేదంటే ఆదోని వంకల సంరక్షణ కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Admin
DNB News