DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఎంతో మద్దతునిస్తాయని తెలిపారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు పారదర్శకంగా ఉద్యోగాలను కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు మరియు అభ్యర్థుల కుటుంబ సభ్యులు
Admin
DNB News