Friday, 17 April 2026 03:45:28 PM
# బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్

“మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు..

Date : 16 April 2026 06:16 PM Views : 10

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... మహిళలపై నేరాల నివారణకు అవగాహన కల్పించేందుకు “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో కర్నూలు మెడికల్ కళాశాల ఆడిటోరియంలో గురువారం అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యల విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలు తగ్గుతాయని అన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలు, పట్టణాలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మహిళలతో పాటు యువతకు కూడా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి కార్యకలాపాలపై నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా. శ్రీరాములు మాట్లాడుతూ అత్యవసర సమయంలో శక్తి యాప్ వినియోగించుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రిటైర్డ్ ఐసీడీఎస్ అధికారి జుబేదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు నేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ గారు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, డాక్టర్లను శాలువా, మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్స్ డా. శ్రీరాములు, డా. సింధియా శుభప్రద, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డా. మాధవి శ్యామల, ఐసీడీఎస్ నుండి అనురాధ, అడ్వకేట్ నాగలక్ష్మి, సీఐలు మధుసూదన్ రావు, రామయ్య నాయుడు, శేషయ్య, శివశంకర్, విక్రమ సింహ, మన్సురుద్దీన్, మారుతి శంకర్, శ్రీధర్ మరియు మహిళా శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :