DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో సుందరయ్య భవన్ (CPM కార్యాలయం) నిర్మాణం కొరకు కల్లుబావి ప్రాంతానికి చెందిన CPM మాజీ కౌన్సిలర్ శ్రీమతి పి.ఎస్. ముత్తమ్మ రూ.20,000లను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని CPM పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, నాయకులు కృష్ణమూర్తి, రాముడు, మనోహర్, రామన్నలకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా CPM పట్టణ కమిటీ ఆదోని తరఫున శ్రీమతి పి.ఎస్. ముత్తమ్మ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆమె చేసిన సహాయం ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు.
Admin
DNB News