DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇంధనం, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదోనిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు జయం మనోజ్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశికళ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు, కరెంట్ చార్జీల ధరలను పెంచుతూ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
DNB News