DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఆదోని పద్మశాలి నగర్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మను కలిసి వివరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆమె, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
Admin
DNB News