DNB News - ఆంధ్రప్రదేశ్ / : జగజ్యోతి, క్రాంతి యోగి మహాత్మా శ్రీ గురు బసవేశ్వరుల జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవేశ్వర సర్కిల్ వద్ద వీరశైవ బంధువులు, హిందూ బంధువులు కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో అర్చనలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురు బసవేశ్వరుల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీకాంత్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురు బసవేశ్వరుల బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో నడవాలని వారు పిలుపునిచ్చారు.
Admin
DNB News