DNB News - ఆంధ్రప్రదేశ్ / : పదవీకాలం ముగిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ల సేవలను ఆదోని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి కొనియాడారు. మంగళవారం ఆదోనిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా ప్రజల కోసం, పార్టీ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన ప్రతి కౌన్సిలర్ను గుర్తుంచుకుంటామని, భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడం ప్రతి నాయకుడి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News