DNB News - ఆంధ్రప్రదేశ్ / : కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో 5వ దశలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని సమీక్షిస్తూ, అధికారులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు మరియు గ్రామస్తుల అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూసర్వేలో ఖచ్చితత్వం ఉండేలా ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఇంచార్జి కలెక్టర్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News