DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జే. దొర కన్నుమూత పట్ల మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణ రావు) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దొర గారు, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా దొర గారు సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని రామారావు పేర్కొన్నారు. ఆముదాలవలస నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న జర్గంగి గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. నిబద్ధత గల పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ, తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదని గుర్తు చేశారు. ఒక సమర్థవంతమైన అధికారిని, క్రీడా ప్రేమికుడిని రాష్ట్రం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని దుంపల రామారావు ప్రార్థించారు....
Admin
DNB News