Monday, 16 March 2026 05:13:05 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

అంగన్వాడీ సమస్యలపై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ..

Date : 03 March 2026 12:54 PM Views : 37

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో, కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా AITUC ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జానకి, రాష్ట్ర సమితి సభ్యురాలు గౌసియా, ట్రెజరర్ గీతాదేవి, ప్రభావతి, శంకరమ్మ, దేవలమ్మ, అధ్యక్షుడు టి.వీరేష్ తదితరులు ప్రధాన సమస్యలు మరియు డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నామని ఆది కృష్ణమ్మ తెలిపారు. రెండు సార్లు వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, కేంద్రాల మౌలిక సదుపాయాల మెరుగుదల, తాగునీరు–మరుగుదొడ్లు–టీవీ–ఆర్వో సదుపాయాలు, 58 వేలకుపైగా సిబ్బందికి 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ అమలు, మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అంగన్వాడీ వర్గాల ప్రధాన డిమాండ్లలో కనీస వేతనం రూ.26,000 ఇవ్వడం, పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ కల్పించడం, గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించడం, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయడం, హెల్పర్ల ప్రమోషన్లకు నియమావళి రూపొందించడం, నాలుగు యాప్‌ల స్థానంలో ఒకే యాప్ అమలు చేయడం, మే నెలలో వేసవి సెలవులపై వెంటనే జీఓ జారీ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :