Monday, 16 March 2026 05:13:08 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్...

Date : 02 February 2026 06:07 PM Views : 60

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 125 ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులు ఇవి : పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన లోకేష్ బాబు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న, ఎమ్మిగనూరు టౌన్‌లోని తన ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద రూ.1 లక్ష 10 వేల ఫోన్‌పే చేయించుకుని, రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన మన్సూర్ అహ్మద్, రైల్వే, ఇన్‌కమ్ ట్యాక్స్, నామినేటెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఢిల్లీ, ముంబాయికి చెందిన వ్యక్తులు రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన విజయకుమార్, వృద్ధాప్యం మరియు అనారోగ్యంతో ఉన్న తనను కుమారుడు రవి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ ఉల్లా, తనపై చెడు ప్రయోగాలు చేసి ఆరోగ్యం క్షీణింపజేశారని, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :