DNB News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జోనల్ కోఆర్డినేటర్గా బీటీ నాయుడు ని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా బీటీ నాయుడు పార్టీకి తన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం ఎప్పుడూ ప్రాణంగా పనిచేస్తూ, నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయిలో మరింత శ్రమించి, కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ టీడీపీ విజయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇప్పటికే శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బీటీ నాయుడు, తాజా నియామకంతో పార్టీకి మరింత సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.
Admin
DNB News