DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం; జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన, మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి 407 మందికి మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయిస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటీ ఛైర్మను మరియు జిల్లా కలక్టరు, జిల్లా మీడియో అక్రిడిటేషను కమీటీఎస్ రాం సుందరరెడ్డి, కమీటీ సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటి సమావేశం జిల్లా కలక్టరు ఆధ్యక్షతన కన్వినరు మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు వారి ఆధ్యర్యంలో కలక్టరు సమావేశ మందిరంలో విజయవంతంగా జరిగింది. జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదంలో మీడియో అక్రిడిటేషను కార్డులు మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ ఎక్స్ ఆఫీసయో సభ్యులు, సి.పి.ఒ. బాలాజి, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పి.ఎస్. ఎస్. ఎస్. వి.ప్రసాదరావు, టి.రాధకృష్ణ (వార్త), కె.రమేష్ నాయుడు, ఎం.పి. వెంకటేశ్వర, బి.జి.ఆర్. పాత్రో, ఎం. శివకుమార్, పి. అప్పారావు, బూరడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్, జిల్లా లెప్రసి టి బి కంట్రోల్ అధికారి డా. కె.రాణి, హౌసింగు పిడి మురళి మోహన్, డి పి ఎ ఒ జె. శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ జి.ఎల్లాజిరావులు, డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్. జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజనీరు పి. మల్లేశ్వరరావు, సహాయ పౌరసంబంధాల అధికారి సిహెచ్. ప్రభుదాస్, తదితరులు పాల్గోన్నారు.
Admin
DNB News