Sunday, 02 August 2026 09:25:58 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రభుత్వ విద్య పరిరక్షణకు విద్యార్థి ఉద్యమం అవసరం..

Date : 28 May 2026 03:56 PM Views : 59

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో జూలై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని స్థానిక సీఆర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు గిడ్డయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జి. వలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం “త్రిబుల్ పీ” విధానం పేరుతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రక్షించాల్సిన ప్రభుత్వం వాటిని కార్పొరేట్లకు అప్పగించే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామని చెప్పే ప్రభుత్వం ఆచరణలో మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌టీఏ పేపర్ లీకేజీలపై స్పందించని విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీల హక్కులను దెబ్బతీసే విధానాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. యూజీసీ వంటి సంస్థలను కేంద్రీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్నారని, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, జూలై 1 నుండి 4 వరకు జరిగే శిక్షణా తరగతుల్లో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు యూనివర్సిటీల మేధావులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి. సోమన్న, ఎస్. షాబీర్ భాష, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు రంగస్వామి, శరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, శ్రీకాంత్, నగర కార్యదర్శి అశోక్, మహిళా నాయకులు మెస్సి, శ్రీకవ్య, నాయకులు మునీస్వామి, విరాంజి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :