DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు మరియు ఐటీ శాఖామాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిశ క్రిష్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బొందిలీ కార్పొరేషన్ ఛైర్మన్ విక్రం సింగ్, ఆకెపోగు ప్రభాకర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
Admin
DNB News