DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ C. శివయ్య, ఆదోని పట్టణ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ D. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన వాహన దొంగతన కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆదోని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No. 31/2026 మరియు Cr.No. 30/2026 కేసులు U/s 303(2) BNS కింద విచారణలో ఉండగా, దర్యాప్తు వేగవంతం చేసి 19-04-2026 న నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులు: మొగిలి మహేష్ కుమార్ (20 సంవత్సరాలు), కంచికచెర్ల, MG బ్రదర్స్ సమీపం, ప్రస్తుతం చన్నబసవ గుడి నగర్, పెట్రోల్ బంక్ దగ్గర నివాసం. హరిగ రమేష్ @ వరణి రమేష్ (25 సంవత్సరాలు), అనంతపురం గ్రామం, కర్నూలు జిల్లా. వీరి వద్ద నుంచి AP-21-BR-5751 నంబర్ గల హోండా CB షైన్ మోటార్ సైకిల్ మరియు AP-39-MT-9431 నంబర్ గల హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రెండు మోటార్ సైకిళ్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
Admin
DNB News