DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళల హక్కులు సాధించుకోవాలంటే చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) జిల్లా అధ్యక్షురాలు శ్యామల పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని రెవెన్యూ భవన్లో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం పట్టణ కార్యదర్శి మగ్భుల్ భాను, మండల కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు పీఎస్ సుజాత, మునెమ్మ, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు వెంకటమ్మ, సరోజమ్మ, మణెమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News