Monday, 16 March 2026 03:49:18 PM
# ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ # సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం ఆస్పత్రిలో చికిత్స

తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి

Date : 14 March 2026 05:42 PM Views : 10

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలో హృదయ విదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి కథ అందరినీ కలచివేస్తోంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన గండేపల్లి మణికంఠ అనే విద్యార్థి స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం అతనికి వార్షిక పరీక్ష ఉండగా, అంతకుముందు రోజు శుక్రవారం తెల్లవారుజామున అతని తండ్రి గండేపల్లి కొండలరావు అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పితృవియోగాన్ని తట్టుకుని కూడా మణికంఠ తన భవిష్యత్తు కోసం ధైర్యంగా ముందుకు వచ్చి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల హృదయాలను కలచివేసింది. కొండలరావు డిగ్రీ వరకు చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ భారం ఆయన భార్య శ్రీలక్ష్మి మీద పడింది. సరైన వైద్యం చేయించుకునే స్థోమత లేక వ్యాధి ముదరడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తాను ఉన్నత చదువులు కొనసాగించాలని ఉందని, దాతలు సాయం చేయాలని విద్యార్థి మణికంఠ కోరుతున్నాడు. ఈ ఘటన బత్తులపల్లి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :