Monday, 03 August 2026 09:25:53 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

హాస్టల్‌లోకి దూసుకెళ్లిన పోలీసులు.. విద్యార్థులపై లాఠీచార్జ్, వీడియో వైరల్

Date : 10 March 2026 10:57 AM Views : 73

DNB News - తెలంగాణ / : పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోకి వెళ్లిన పోలీసులు విద్యార్థులపై లాఠీలతో దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జరిగిన ఇండియా–న్యూజిలాండ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత మైసమ్మగూడలోని ఓ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు బయటకు వచ్చి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు విసిరారని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఆగ్రహంతో ఇద్దరు పోలీసులు హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు చెబుతున్నారు. బాధితుల మాటల్లోకి వెళ్తే, హాస్టల్ సిబ్బంది చెప్పిన విషయాలను నమ్మి పోలీసులు లోపలికి వచ్చి లాఠీలతో తమపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లోకి వెళ్లి విద్యార్థులను కొట్టిన దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :