DNB News - తెలంగాణ / : సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. సదాశివపేట పట్టణంలో బీజేపీ కౌన్సిలర్ భర్త సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయి లక్షల రూపాయలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఉమారాణి భర్త ఉల్లిగడ్డల నాగన్నకు మొబైల్ ఫోన్కు ఓ లింక్ వచ్చింది. అది మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చినదిగా భావించి ఆయన ఆ లింక్ను ఓపెన్ చేశారు. అనంతరం ఎలాంటి ఓటీపీ రాకుండానే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి మూడు విడతలుగా మొత్తం రూ.7 లక్షల 79 వేల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్కు గురైన నాగన్న తాను సైబర్ మోసానికి గురైనట్టు గుర్తించి వెంటనే సదాశివపేట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Admin
DNB News