DNB News - తెలంగాణ / : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న వివోఎ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా సిపిఎం ఆఫీసు గజ్జల వెంకటయ్య భవనం ఎదురు గా వివో ఏలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా తమ జీతాల పెంపు కోసం సమ్మెచేస్తున్నారు ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు వసపంగువీరన్న మాట్లాడుతూ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వివోఎలవేతనాలు పెంపు చేస్తామని వాగ్దానం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వివో ఏల వేతనాల పెంపు గురించి మాట్లాడకపోవడం అన్యాయమని గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకు ఆర్థిక వెలుగులు నింపే గ్రామ దీపికలు గా పేరుపొందిన వివో ఏ ల కుటుంబాలలో మాత్రం చీకటి మయంలో ఉంటుందని వీరు చాలీ చాలని జీతం తో బ్రతుకులు ఈడుస్తున్నారని వీరి పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం సరికాదని ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ సమ్మె చేస్తున్న వివో ఏ లను తమ జీతాలు పెంచుతూ ప్రకటన చేస్తూ సమ్మె విరమింపజేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి ప్రభుత్వం వేతనాలు పెంచే వరకు పోరాడుతామని అన్నారు . కాదు కూడదని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే ఎలక్షన్ లో మహిళలందరూ వ్యతిరేకంగా పనిచేస్తారని ఈ విషయం గత పాలకులకుకూడా తెలుసని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు జూన్ రెండవ తారీకు లోపు ఏ విషయమైంది స్పష్టమైన హామీ ఇవ్వాలని స్కీం వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్న అన్ని కార్మిక వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతూ వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివో ఏల జిల్లా నాయకురాలు వేల్పుల సుశీల అరుణ మెట్టురాణి గుగ్గిళ్ళ ఉమా మండాది కళమ్మ పోలూరు విజయలక్ష్మి బొడ్డు కుసుమ మాధురి మేకల కృష్ణవేణి కవిత కుమారి రమణ సువర్ణ ఉషారాంబాయి మంజుల జయ నాగేశ్వరి శ్రావణి స్రవంతి తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News