DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండలంలోని జూపెడ గ్రామంలో బుధవారం పాడిపశువులకి పశు వైద్యాధికారులు , గోపాలమిత్రల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సుబ్లేడు వైద్యాధికారి షైక్. జానీ , బీరోలు వైద్యాధికారి డి భవిత ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఆ గ్రామంలోని పాడి రైతులతో వైద్యాధికారి షైక్ జానీ మాట్లాడుతూ ఎదకి రాని గేదెలను గుర్తించి అవి ఎదకి వచ్చేలా వైద్యపరీక్షలు చేపించుకోవాలని, అలా వైద్యపరీక్షలు చేపించుకొన్న తరువాత అవి ఎదకి వస్తే గూపాలమిత్రల సహాయంతో కృత్రిమ గార్భాధారణ ఇంజక్షన్స్ వేయించి గర్భదారణ ఐయ్యే విదంగా పశువులకి వైద్యం చేపించుకోవాలని రైతులకి చూచించారు. అదేవిదంగా సూడి గేదెలను పరీక్షించి వాటికి సరైన మందులు పంపిణీ చేశారు. పాలిచ్చే పాడి గేదెలకి పాల దిగుబడి పెరగటానికి మినరల్ మిక్షర్ పాకెట్స్ పంపిణీ చేశారు. అదేవిదంగా లేగ దూడలకి జబ్బులు ఆశించకుండా సక్రమంగా పెరుగుదలకి, నట్టల నివారనకి లేగ దూడలకి నట్టల మందులు పోశారు.పాడి పశువుల వలన రైతులకి మేలు జరుగుతుంది పాడి పశువుల ద్వారా పాలు అధిక మొత్తం లో పాడి దిగుబడి చేయటం వలన మన దేశానికే ఎంతో మేలు జరుగుతుందన్నారు.పాడి పశువులకి ఇంకేమైనా జబ్బులు కానీ ఏ ఇతరత్రా సమస్స్యలు వస్తే మన ఊర్లల్లో గోపాలమిత్రలు వస్తూవుంటారు వారికి చెప్పి వైద్యం చేపించుకోవచ్చని తెలిపారు. వారి తో పాటు మేమూ వచ్చి మీ గ్రామంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి సకాలంలో మీ పశువులను కాపాడుతామని రైతులకి తెలియజేశారు. ఈ పాడి పశువుల వైద్య శిబిరంలో జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం. నరేందర్ రెడ్డి , గోపాలమిత్ర సూపర్వైజర్ నాగేశ్వర్రావు , జూపెడ గోపాల మిత్ర మట్టే. వీరబాబు , వారితోపాటు వివిధ గ్రామా
Admin
DNB News