DNB News - తెలంగాణ / : స్వాతంత్ర సమరయోధుడు చిల్లం చర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి జ్ఞాపకార్ధం ఆమె కుటుంబ సభ్యులు గురువారం మండల కేంద్రంలోని స్థానిక సాయి గాయత్రి విద్యాలయ నందు పేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వరలక్ష్మి కుమారులు కందిబండ సత్యనారాయణ, చిల్లంచర్ల గిరిధర్ మాట్లాడుతూ, ఇటీవల ఆరోగ్యంతో మరణించిన తమ తల్లి జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు నేడు దుస్తులు పంపిణీ చేశామని, ఇంకా భవిష్యత్తులో కూడా మండలంలోని పేద ప్రజలకు మరియు విద్యార్థులకు పలుసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నామని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో చల్లంచర్ల వరలక్ష్మి కుటుంబ సభ్యులు మరియు పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News