DNB News - తెలంగాణ / : మునగాల:మండల కేంద్రంలోని ఊర చెరువు మరియు తాడ్వాయి గ్రామ శివారులోని ఎర్ర చెరువు ను అక్రమంగా కొంతమంది ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టి పోయిస్తూ స్వాధీనం చేసుకున్నప్పటికీ, చెరువు భూములను రక్షించి ఆక్రమణలనుఅడ్డుకోవాల్సిన సంబంధిత రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరించడం సరైన కాదని, తక్షణమే చెరువు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని మునగాల, తాడ్వాయి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పిట్టల శీను, బిట్టు లింగయ్య డిమాండ్ చేశారు, బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మునగాల గ్రామంలోని ఊరచెరువును మరియు తాడ్వాయి గ్రామంలోని ఎర్ర చెరువును గత రెండు నెలలుగా కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని చెరువు శిఖం భూముల్లోమట్టితోలకం పనులు నిర్వహిస్తూ, అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై తాము ఇప్పటికే మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ మరియు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఇరు శాఖల అధికారులు సంబంధిత అక్రమనదారులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా రోజురోజుకు చెరువు శిఖం భూములపై ఆక్రమణదారులు పెత్తనం చెలాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, చెరువుల ఆక్రములపై స్థానిక అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు సైతం అధికారులకు పలుమార్లు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు నేటి వరకు ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు, ఇప్పటికే ఇరు చెరువుల్లో చెరువు సరిహద్దుల్లో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆక్రమించుకోవడంతో చెరువు విస్తీర్ణం తగ్గి తాగు సాగునీటికి మరియు చెరువుల్లో మత్స్య సంపదపై జీవనం గడిస్తున్న మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే చెరువు ఆక్రములపై దృష్టి పెట్టి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Admin
DNB News