DNB News - తెలంగాణ / : ఉత్తరప్రదేశ్లో తీవ్రవాద అనుమానాలతో ఓ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. Uttar Pradesh Anti-Terrorism Squad అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సహారన్పూర్కు చెందిన హారిస్ అలీ అనే బీడీఎస్ విద్యార్థిని… మొరాదాబాద్లో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో నకిలీ పేర్లతో అకౌంట్లు సృష్టించి… వాట్సాప్కు సమానమైన యాప్స్, అలాగే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ల ద్వారా గ్రూపులు నిర్వహించినట్లు సమాచారం. ఆ గ్రూపుల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ… యువతను ప్రేరేపించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ISIS కు సంబంధించిన ప్రచార పత్రికలు, వీడియోలు, ఆడియోలు పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ‘అల్ ఇత్తెహాద్ మీడియా ఫౌండేషన్’ పేరిట గ్రూప్ సృష్టించి… విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఈ కేసులో యూపీఏటీఎస్ అధికారులు యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి… ఇంకా ఇతర అనుమానితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
DNB News