DNB News - తెలంగాణ / : మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ అక్కడికి వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తున్నామని ఇండిగో వెల్లడించింది. మార్చి 6న మధ్యప్రాచ్యంలోని ఎనిమిది గమ్యస్థానాలకు మొత్తం 17 డిపార్చర్లు, అంటే 34 సెక్టార్ల విమానాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలకు సంబంధించిన ప్రయాణికులను వారి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ద్వారా నేరుగా సంప్రదిస్తామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులు తమకు సమాచారం అందకపోతే విమానాశ్రయానికి వెళ్లవద్దని సూచించింది. అలాగే ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని, ఫ్లైట్ ప్రభావితమైతే ప్రత్యామ్నాయ విమానాలు లేదా రీఫండ్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
Admin
DNB News