DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా, తిరుమల పాలెం మండలం, పైనంపల్లి గ్రామానికి చెందిన, లక్ష్మి ప్రసాద్. గట్టిగండ్ల తెలంగాణ రాష్ట్రా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం లక్ష్మి ప్రసాద్ విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ రాష్ట్రంలో, అనేక జిల్లాలలో పర్యటించారు. సౌత్ ఇండియాలో తమిళనాడు చెన్నై, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విజయవాడ, తెలంగాణ మరియు రాయలసీమ లల్లో లక్ష్మి ప్రసాద్ అలుపెరగని బాటసారిగా తిరుగుచూ మూఢనమ్మకాల నిర్మూల సంఘానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ప్రకృతి దర్శనం కార్యక్రమాలు నిర్వహించారు కులాంతర మతాంతర దండల పెళ్లిలను సమన్వయం చేశారు. మూఢనమ్మకాల సంఘటనలు జరుగుతాయో అక్కడికి తను వేగంగా స్పందిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కూకట్ పల్లిలో మ్యాజిక్ శిక్షణ పూర్తి చేసుకున్న లక్ష్మి ప్రసాద్ సంఘం ఆద్వర్యంలో జరిగిన కూకట్ పల్లి, ఉండవల్లి, మోకిల్లా, చేవెళ్ల లలో జరిగిన శిక్షణా తరగతుల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తూ వాటికి నాయకత్వం వహించారు. గత సెప్టెంబర్లో ముంబైలో జరిగిన జాతీయ మహాసభలలో కమిటీ సభ్యులుగా, సంఘం నిర్మాణంలో, విస్తరణలో కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా పని చేసి తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల పాటు తాను ఈ భాద్యతలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు డా. బైరి నరేష్ సుజాత టీచర్ లు తనకు శుభాకాంక్షలు తెలిపారు. సహాయక కార్యదర్శి గా ఎన్నికైన సందర్బంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మన ప్రధాన లక్ష్యం మూఢనమ్మకాలను నిర్మూలించడం ప్రజలను చైతన్యపరచడం దానికోసం మరింత అంకితభావంతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేశారు. తనపై నమ్మకం తో ఇంత బాధ్యతా యుతమైన పదవిని నాకు అప్పజెప్పి ప్రోత్సహిస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులకు లక్ష్మి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రజాసంఘాల వారు ఆ గ్రామ ప్రజలు గట్టిగుండ్ల. లక్ష్మి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
DNB News